మంగళవారం, ఏప్రిల్ 03, 2012

ఇల పై పర్వతాలు ఉన్నంతవరకు , నదులు పారుతున్నంత వరకు నీ రామాయణ కావ్యం నిలిచి వుంటుంది . రామాయణ కావ్యం నిలిచి ఉన్నంత వరకు నీవు నిలిచి ఉంటావు .




చతురు ముఖ బ్రహ్మ వరం ......


వాక్దేవి సరస్వతి నీ నోట పలికించింది రామ కథ .
నీవు పలికేదేల్ల సత్యం , అందులో అపశ్రుతి లేదు , అనృతం అంతకంటే లేదు .
సందేహమే వలదు . నారదుడు చెప్పినట్లు గా రామ కథ రచించు .
ఆ లోకోత్తర పుణ్య పురుషుడు , ఆ లక్ష్మణుడు , ఆ మహా తల్లి వైదేహి   భాధలు తెలిసినవి , తెలియనివి
 ఆ రాక్షస గుణాలు  అన్ని నీకు భవిష్యత్తులో ,నీవు రచన చేస్తూ పో  అవగతమౌతాయి  వాటికవే .


ఇల పై పర్వతాలు ఉన్నంతవరకు  , నదులు పారుతున్నంత వరకు 
నీ రామాయణ కావ్యం నిలిచి వుంటుంది .
 రామాయణ కావ్యం నిలిచి ఉన్నంత వరకు నీవు నిలిచి ఉంటావు .