క్రౌంచ పక్షులు జంట - కోరికలే రెక్కలై స్వేచ్చగా జంటగా ఎగురువేళ
నిషాదుని శరము విషాదము చిమ్మింది -
మగటి నేల కొరిగింది పెంటి గుండె పగిలింది
అసువులు బాశాయి ఆ క్రౌంచ పక్షులు రెండు
అశ్రువులు కురిశాయి కవి కోకిల కన్నులు రెండు .
క్రౌంచ పక్షుల మైదునపు రావాలు , మన వాల్మీకి దృష్టిలో పడ్డాయి .
శ్రుష్టి కార్యములో మునిగి ఉన్న ఆ చూడ ముచ్చట ఐన జంట లో చాటున ఉన్న బోయవాని బాణము తగిలి మగ పక్షి మరణించినది , దాని చుట్టూ తిరుగుతూ తల ను బలంగా ఎగిరేగరివచ్చి నేల కు కొట్టుకొని ఆ ఆడ పక్షి కూడా చనిపోయింది .ఆ భాదాకర దృశ్యము మన మహారిషిని వీపరితంగా దు:ఖితుని చేసింది .
ఆ మహా శోకము నుంచి వచ్చింది మహోన్నతమైన శ్లోకం
" మా నిషాద ప్రతిష్టాంత్వ మగామః శాశ్వితి: సమః
యత్ క్రౌంచ మిధునాత ఏక మవధి: కామ మోహితం
తస్య ఏవం భ్రువతః చింతా బభూవ హృది వీక్షితః
శోకత్రేనా అస్య శకునే: కిం ఇదం వ్యహరితాం మయః "