ఇరు వర్గాల బంధు మిత్రులతో , ప్రజలతో శోభాయమానముగా
తీర్చి దిద్దిన వీధులతో మందిరాలతో , విందులు వినోదాలతో , దాన ధర్మాలతో మిల మిల మెరిసిపోతువున్నది మిథిలాపురి.
వరపూజ చేశాక తోడుకొని పోయిరి కళ్యాణ వేదికకు .
గౌరీ పూజా గావించి తోడ్కొని వచ్చిరి సీతమ్మను .
అగ్ని సాక్షిగా జనకుడు సీతమ్మను రామునికి చూపిస్తూ ......
రామా..... ఈమే నా పుత్రిక సీతా
ఈమె చేతిని నీ చేతిలోనికి తీసుకో
ఈమె పతి వ్రత నీ సహధర్మచారిణి
నీ నీడలా నిను అంటి వుంటుంది .
అంటూ మంత్ర జలము రాముని చేతిలో పోశాడు.
మంగళ వాయిద్యములు , దేవ దుందుభులు కరతాళ ధ్వనులు మిన్ను ముట్టి నవి . దేవతలు పూల వర్షం కురిపించారు . మంగళ సుత్రాధారణ జరిగింది - మన మసులు ఉప్పొంగి పోయాయి .
కన్నుల నిండా ఆనందభాష్పాలు , చేతులనిండా అక్షింతలు
చిరుజల్లు లా అక్షింతలు ఆ నవ వధూవరుల పై కురిపిస్తూ
పెద్దలు ఆశీర్వదిస్తూ , పిన్నలు ఐన మనము నమస్కరిస్తూ
నయన మనోహరంగా అత్యంత వైభోగాముగా సీతా రాముల కళ్యాణము జరిగింది .